Tuesday, August 6, 2013

ఏవో మౌన రాగాలు


చిత్రం: పగబట్టిన పడుచు (1971)
సంగీతం: యం. రంగారావు
నేపధ్య గానం: సుశీల


పల్లవి:

    ఓహో....ఓహొ...ఓ..ఓ...ఓ...
    ఏవో మౌన రాగాలు...ఏవో మధుర భావాలు...
    నాలో కదలె... ఈ వేళా

    ఏవో మౌన రాగాలు... ఏవో మధుర భావాలు...
    నాలో కదలె ...ఈ వేళా

చరణం 1:

    తుంటరి వయసేమన్నది...తూగాడు నడుమేమన్నది
    చెరలాడు పైటేమన్నది...విరహాలు ఇక చాలన్నది

    తుంటరి వయసేమన్నది...తూగాడు నడుమేమన్నది
    చెరలాడు పైటేమన్నది...విరహాలు ఇక చాలన్నది
    రారా ఓ చెలికాడా...వలపే నీదేరా...నీదేలేరా

    ఏవో మౌన రాగాలు...ఏవో మధుర భావాలు
    నాలో కదలె ఈవేళా..

చరణం 2:

    మాధవుడందని రాధనై...ఆ రాధ తియ్యని బాధనై
    ఆ బాధ మోయని గాధనై...ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను

    మాధవుడందని రాధనై...ఆ రాధ తియ్యని బాధనై
    ఆ బాధ మోయని గాధనై...ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను..
    రారా ఓ చెలికాడా...నేనే ఆ రాధనురా...నీ రాధనురా

    ఏవో మౌన రాగాలు... ఏవో మధుర భావాలు..
    నాలో కదలె ఈవేళా... 

No comments:

Post a Comment