చిత్రం : శాంతి నిలయం (1972)
సంగీతం : ఎస్. పి. కోదండపాణి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : వసంత, బాలు 
పల్లవి :
దేవీ క్షేమమా.. దేవరవారూ క్షేమమా
దేవీ క్షేమమా..  దేవరవారూ క్షేమమా
తమ కడగంటి చూపే కరువైనాదీ.. 
తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ.. దేవీ క్షేమమా..   
చరణం 1 :
నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ?
నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా? 
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?
తెల్లవార్లు నిదుర రాక ఎర్రబారుతున్నవీ..  దేవీ క్షేమమా..  
చరణం 2 :
జడలోన మల్లెపూలు ఇమడకున్నవి
జత లేక పట్టుపరుపు కుదరకున్నది
తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి
తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి
అవి కూడ నలిగిపోయి జాలివేస్తున్నది..  దేవీ క్షేమమా.. 
చరణం 3 :
నీ బడిలో చదవాలి క్రొత్త క్రొత్త చదువులూ
నేనపుడు అడగాలి చిలిపి చిలిపి ప్రశ్నలూ
నీ పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ
పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ
నీ మగసిరి గెలవాలి అసలైన పరీక్షలూ 
దేవీ క్షేమమా . .  దేవరవారూ క్షేమమా . . దేవీ క్షేమమా . .
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2432
No comments:
Post a Comment