చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం : వాణీజయరాం
పల్లవి :
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా..
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా
వేణువు విందామని నీతో వుందామని... నీ రాధా వేచేనయ్యా రావయ్యా...
ఓ.... గిరిధర... మురహర... రాధా మనోహరా...
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..రావయ్యా..
చరణం 1 :
నీవు వచ్చే చోట... నీవు నడిచే బాట
మమతల దీపాలు వెలిగించాను
మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని... పదములు కడగాలని
కన్నీటి కెరటాలు తరలించాను
ఓ....ఓ.... గిరిధర... మురహర... నా హృదయేశ్వరా..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా....
చరణం 2 :
నీ పద రేణువునైనా... పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమని భావించానూ..బ్రతుకే ధన్యమని భావించానూ
నిన్నే చేరాలని... నీలో కరగాలని...
నా మనసే హారతిగా వెలిగించానూ..
గోవిందా గోవిందా గోవిందా .... గోపాలా.......
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2042
No comments:
Post a Comment