Saturday, December 29, 2018

మనసూ మమతా

చిత్రం : ప్రాణమిత్రులు (1967)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల 



పల్లవి :


మనసూ మమతా మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే శత్రువు చేసే
మనసూ మమతా... మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే... శత్రువు చేసే
రాగం కన్నా... త్యాగం గొప్పని
చల్లని నిప్పును... రగిలించి... రగిలించి
నాటకమాడుట నీ లీల...  నలిగినపించుట మా పాలా
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ... నీదీ..


చరణం 1 : 



ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ


పరిహాసానికి ఏదో అన్నది...  ప్రళయంగా ఇటు ముగిసినదీ
పరిహాసానికి ఏదో అన్నది...  ప్రళయంగా ఇటు ముగిసినదీ
ప్రణయ జీవులను విడదీసి... బ్రతుకులు బద్దలు చేసినదీ..


ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ...  ఓ భగవాన్ నీదీ...నీదీ 



చరణం 2 : 


నాకున్నది ఒకటే హృదయం... అది చేసినదొకటే..స్నేహం
నాకున్నది ఒకటే హృదయం...  అది చేసినదొకటే..స్నేహం


నే నెరిగినదొకటే ధర్మం...  అది చూపిన దొకటే..మార్గం
ఏ కన్నులు కన్నీరైనా....   ఏ కలలే కరిగిపోయినా


ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ...  ఓ భగవాన్ నీదీ...నీదీ..






No comments:

Post a Comment