చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : ఏసుదాసు
పల్లవి:
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..
చరణం 1:
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో..
విన్నవించు నా చెలికి విన్న వేదనా.. నా విరహ వేదనా
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
చరణం 2:
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..
No comments:
Post a Comment