చిత్రం : గోదావరి పొంగింది (1985) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది... ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది పర్ణశాల ఒరిగింది... పారాణి కరిగింది కరగనీ.. ఒరగనీ.. పాపికొండ మిగిలింది ఈ పాపికొండ మిగిలింది
ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...
చరణం 1 :
వెనుకకు తిరగని కథలో... ముందుకు పోతే కడలి కడలి తాను కలిసిందంటే... ఉండదు తల్లి గోదావరి అంటరాని బాలికా అరుంధతి తారక.. అంటరాని బాలికా అరుంధతి తారక.. ఏ వశిష్టుడొస్తాడో నన్ను చేరగా...
ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...
చరణం 2 :
కలిసిన మనసులా గుడిలో... గాలికి ఆరని దీపం అలల మీద ఆడే పడవై... ఊగిసలాడే ఈ ప్రాణం కన్నీరే ఏరుగా.. నడి ఏరే రేవుగా కన్నీరే ఏరుగా.. నడి ఏరే రేవుగా ఎన్నాళ్ళీ ఆశలూ.. గుండె కోతలు...
ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది... ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది పర్ణశాల ఒరిగింది... పారాణి కరిగింది కరగనీ.. ఒరగనీ.. పాపికొండ మిగిలింది ఈ పాపికొండ మిగిలింది
No comments:
Post a Comment