చిత్రం : ఆడంబరాలు-అనుబంధాలు (1974)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
ఆషాడమాసానా... ఆకాశతీరాన
అడుగులో అడుగిడి... అంతలో తడబడి
నీలాల ఓ..మేఘమాలికా
వారానికి ఏడు రోజులు ఎందుకనీ
రోజుకు ఇన్నిఝాములు ఎందుకనీ
చెప్పవే చెప్పవే... చెప్పవే..
నా మాట...మావారితో
చెప్పవే.. నా మాట మావారితో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..
చెప్పవే.. . నా మాట నా చెలియతో
వేరెవ్వరూ లేని..వేళలో..ఆ వేళలో..
చెప్పవే నామాట..నా చెలియతో..ఓ.. ఓ
చరణం 1 :
మగత నిదురలో నేనుంటే
నా మదిలో మెదిలేది తానేననీ
మగత నిదురలో నేనుంటే
నామదిలో మెదిలేది తానేననీ
కలవరపడి నే నెటు చూసినా
కలకల నవ్వేది తానేననీ
కొలిచే దేవుని రూపంలో.. నిలిచే దేవుడు తానేననీ..
చెప్పవే చెప్పవే..నామాట మావారితో..
చరణం 2 :
మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
మల్లెలోనీ తెల్లదనం... తన మనసులోనే చూశాననీ
ఆ మనసులోనీ మంచితనం... తన కనులలోనే చూశాననీ
అందానికీ అనురాగానికీ...
అందానికీ అనురాగానికీ... అవధులు తనలోనే చూశాననీ..
చెప్పవే చెప్పవే చెప్పవే నామాట..నా చెలియతో
వేరెవ్వరూ లేని వేళలో... ఆ వేళలో
చెప్పవే నామాట మావారితో..
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3130
No comments:
Post a Comment